వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ ప్రారంభం
06 Sep 2022 12:25 PM
బ్యారేజ్సమీపంలో వైయస్ఆర్, గౌతమ్రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్
నెల్లూరు: మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు.. వేద పండితుల మంత్రోచ్చరణలు అనంతరం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి సంగం బ్యారేజ్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. అనంతరం బ్యారేజ్ సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి విగ్రహాలను సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి రాజమోహన్రెడ్డి దంపతులు, దివంగత మంత్రి గౌతమ్రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి, కుటుంబ సభ్యులు, మంత్రులు కాకాణి గోవర్థన్రెడ్డి, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు.