27న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అధ్యక్షతన కీలక స‌మావేశం

తాడేపల్లి: ఈనెల 27వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. కొత్త మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 27వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ బలోపేతానికి సంబంధించి మంత్రులు, పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. 

తాజా వీడియోలు

Back to Top