వైయ‌స్ఆర్ ఆశీర్వాదం తీసుకున్నా

ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి 
 

వైయ‌స్ఆర్ జిల్లా: దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని ... ఆ మహా నేతకు నివాళులర్పించి ఆశీర్వాదం తీసుకున్నానని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఇడుపులపాయలోని  వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద బుధవారం మ‌హానేత‌కు నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే వాళ్లకు టీడీపీలో స్థానం లేదని మల్లికార్జున రెడ్డి వాపోయారు. పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ నెల 22వ తేదీ టీడీపీకి రాజీనామా చేసిన మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ నెల 31న‌ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు మేడా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.  

 

Back to Top