ఘ‌నంగా మ‌హాత్మాగాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి వేడుక‌లు

మ‌హ‌నీయుల చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పించిన నేత‌లు

తాడేపల్లి: జాతిపిత మ‌హాత్మా గాంధీ, భార‌తర‌త్న మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి వేడుక‌ల‌ను తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌హాత్మాగాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి చిత్ర‌ప‌టాల‌కు సాంఘిక సంక్షేమ శాఖ‌ మంత్రి మేరుగు నాగార్జున‌, వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్సీలు జంగా కృష్ణ‌మూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, పోతుల సునీత‌, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. దేశం కోసం ఆ మ‌హానుభావులు అందించిన సేవ‌ల‌ను నేత‌లు కొనియాడారు. 
 

Back to Top