వైయ‌స్ఆర్‌సీపీలోకి మాధ‌వ‌రం రామిరెడ్డి 

వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిక‌

మంత్రాలయంలో టీడీపీకి షాక్‌

క‌ర్నూలు:  మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ త‌గిలింది. ఇటీవ‌ల క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌, ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. తాజాగా మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నాయ‌కుడు మాధ‌వ‌రం రామిరెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని రామిరెడ్డి తెలిపారు.

మంత్రాల‌యంలో వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాల‌నాగిరెడ్డిని గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని రామిరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో త‌మ‌ సత్తా ఏంటో చూపిస్తానని పేర్కొన్నారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వైఎస్‌ జగన్‌కు బహుమతిగా ఇస్తామని ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. తనకోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అప్పట్లో పార్టీ మారానే కానీ, డబ్బులు, పదవులు కోసం పార్టీలు మారే సంస్కృతి కాదని అన్నారు. కాగా యూజ్‌ అండ్‌ త్రో పాలసీకి పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు కర్నూలు టికెట్‌ ఇవ్వకుండా ఎస్వీ మోహన్‌రెడ్డికి మొండి చేయి చూపించిన విషయం తెలిసిందే.

తాజా వీడియోలు

Back to Top