కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషం
04 Apr 2022 12:57 PM
విజయవాడ: బంధువుకు కాకపోయినా ఎన్టీఆర్ను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గౌరవించారని, కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్పర్సన్, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎన్టీఆర్కు నిజమైన వారసుడు జగన్మోహన్రెడ్డి. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరిందన్నారు. టీడీపీ పార్టీని లాక్కుని ఎన్టీఆర్ను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు. మొదటి నుంచి ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు కక్ష.. వ్యతిరేక భావం. ఎన్టీఆర్ మంచివాడు కాదు అని బ్యాడ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. భారతరత్న విషయంలో కూడా ఎన్టీఆర్కు చంద్రబాబు ద్రోహం చేశాడు. టీడీపీ దొంగల పార్టీగా తయారైందని అన్నారు.