కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కియా కారు ‘సెల్తోస్’ విడుదల చేసిన మంత్రులు
08 Aug 2019 5:58 PM
అనంతపురం: కియా కారు సెల్తోస్ మోడల్ను మార్కెట్లోకి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, శంకర్నారాయణ, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి చదివి వినిపించారు. పెనుకొండ సమీ కియా కార్ల పరిశ్రమను 13 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా 3 లక్షల కార్లను తయారు చేస్తున్నట్లు కియా సంస్థ ప్రకటించింది. ఏపీలో కార్ల పరిశ్రమను స్థాపించాలని 2007లో కియా యాజమాన్యాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్రాజశేఖర్రెడ్డి కోరారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చట్టం చేశారు. సెల్తోస్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, శ్రీధర్రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, వై. విశ్వేశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు.