సీఎం వైయస్‌ జగన్‌తో ‘కియా’ ప్రతినిధులు భేటీ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కియా మోటార్స్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కియా మోటార్స్‌ ఇండియా ఎండీ కూక్‌ హ్యూన్‌ షిమ్, కియామోటార్స్‌ లీగల్‌ హెచ్‌ఓడీ జుడే లి, ప్రిన్సిపల్‌ అడ్వయిజర్‌ డాక్టర్‌ సోమశేఖర్‌ రెడ్డి ఉన్నారు. 

Back to Top