వైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి
ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని కృత్రిమ ఉద్యమం ఇంకెన్నాళ్లు?
04 Jul 2020 4:38 PM
అమరావతి మూడు గ్రామాల ఉద్యమంగా మిగిలింది
అమరావతిని అంతర్జాతీయ సమస్యగా సృష్టిస్తున్నారు
సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు చెల్లింపు
మంత్రి కన్నబాబు
విజయవాడ : ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని అమరావతి సమస్యను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి కృత్రిమ ఉద్యమం ఇంకెన్నాళ్లు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. 200 రోజుల నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని, కానీ వాస్తవాలు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతాయన్నారు. వాస్తవాల్లోకి రండి అని టీడీపీ నేతలకు సూచించారు. శనివారం కన్నబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కొని రైతులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాజధాని వికేంద్రీకరణ చేస్తుంటే, టీడీపీ నేతలు జీర్జించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా రోడ్లపైకి రాని చంద్రబాబు కుటుంబం.. ఇప్పుడు వేల కోట్ల స్పప్నం తరలిపోతుందనే వేదనతో బయటకొస్తుందని విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులకు కౌలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు చెల్లించారని గుర్తుచేశారు. రాజధాని వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఈ విషయాన్ని ఉద్యమంలో ఉన్న ప్రజలు ఆలోచన చేయాలని మంత్రి కన్నబాబు కోరారు.
ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఎందుకు అడ్డుపడుతున్నారు..
రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.
అమరావతి సమస్యను అంతర్జాతీయ సమస్యగా సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. 23 గ్రామాల రాజధాని ఉద్యమం ఇప్పుడు మూడు గ్రామాల ఉద్యమంగా మారిందన్నారు. అమరావతి గ్రాఫిక్ డిజైన్ల కోసం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబుకు రాజధాని ప్రాంత రైతుల కౌలు ఇవ్వడానికి మనసు రాలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ను చంద్రబాబు గౌరవించడం లేదని ఆరోపించారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ జరగాలని స్పష్టంగా చెప్పిందని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు.