సభ ఔన్నత్యాన్ని కాపాడాలి

మంత్రి కన్నబాబు
 

అమరావతి:  టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, సభ ఔన్నత్యాన్ని కాపాడాలని మంత్రి కన్నబాబు కోరారు. సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని కోరారు. చంద్రబాబు సభను అకారణంగా బాయ్‌కాట్‌ చేసి  ఎక్కడో కూర్చొని సభలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి దిగజారుడు రాజకీయాలు చేసే నాయకుడు ఎవరూ ఉండరు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు సభా సమయాన్ని అడ్డుకుంటున్నారు. ఎథిక్స్‌ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. టీడీపీ సభ్యులను కంట్రోల్‌ చేయకపోతే సభ ఔన్నత్యం దెబ్బతింటుందని మంత్రి కన్నబాబు అన్నారు.
 

Back to Top