జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
కల్గుడి యాప్ను ఆవిష్కరించిన మంత్రి కన్నబాబు
20 May 2020 11:22 AM
రైతులు పండించిన పండ్లు, కూరగాయలు విక్రయించేందుకు కల్ గుడి యాప్
విజయవాడ: రైతులు పండించిన పండ్లు, కూరగాయలు విక్రయించేందుకు వీలుగా రూపొందించిన ఆన్లైన్ యాప్ను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆవిష్కరించారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..ఆంధ్ర గ్రీన్స్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన వినియోగదారులకు పండ్లు, కూరగాయలు అందజేస్తామన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఆంధ్ర గ్రీన్స్ ఆన్లైన్ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే స్విగ్గీ, జుమాట ద్వారా పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నామన్నారు. 8 లక్షల 11 వేల ఫ్రూట్స్ కిట్స్ను ఇంటి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పంటల ధరలు పడిపోకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. ధరలు పడిపోకుండా ప్రభుత్వమే భారం భరించి రైతులను ఆదుకుంటుందన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి వెయ్యి కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి కన్నబాబు వివరించారు.