తిండికి ఇబ్బంది పడకూడదనేదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ 

కృష్ణా : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడకూడదనేదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. పెడన నియోజకవర్గంలో  ఎమ్మెల్యే జోగి రమేష్ వాలంటీర్లతో కలిసి శనివారం ఇంటింటికి వెళ్లి పేదలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పేదలను ఆదుకునే ప్రయత్నం సీఎం వైయస్‌ జగన్ చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్‌లో పడుకొని రాష్ట్రంలో అది చేయండి.. ఇది చేయండి అంటూ బోడి సలహాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మా ప్రభుత్వానికి నీతులు చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయాల్లో బతికే ఉన్నానని ప్రజలకు గుర్తు చేసేలా చంద్రబాబు హైదరాబాద్ నుంచి రోజుకో లెటర్ రాస్తున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చే బాధ్యత మా ప్రభుత్వానిదేనని వెల్లడించారు. కరోనా మహమ్మరి కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ శాయశక్తులా కృషి చేస్తున్నారు. నిరుపేదలకు మూడు విడుతలుగా ఉచిత రేషన్, వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారని జోగి  రమేష్‌ పేర్కొన్నారు. 

 

Back to Top