వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తి ఏకగ్రీవ ఎన్నిక
01 Mar 2019 1:14 PM
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన వైయస్ఆర్సీపీ బీసీ అధ్యాయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 25న జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన్ను ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు శాసన సభ కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు. కాగా, జంగాకృష్ణమూర్తికి వైయస్ఆర్సీపీ తరఫున వచ్చే ఏకైక ఎమ్మెల్సీ పదవిని బీసీ వర్గానికి ఇస్తున్నట్లు ఇటీవల ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు జంగాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా వైయస్ జగన్ కృషి చేశారు. దీంతో బీసీ వర్గానికి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.