సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
రేపు విశాఖకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
03 Jun 2019 12:51 PM
శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్న సీఎం
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా విశాఖకు వైయస్ జగన్
విశాఖ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విశాఖలో పర్యటించనున్నారు. రేపు ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు బయల్దేరతారు. పెందుర్తి మండలం చిన్న ముషిరివాడలోని శ్రీ శారదా పీఠాన్ని వైఎస్ జగన్ సందర్శిస్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని కలుసుకుని ఆశీర్వచనం తీసుకోనున్నారు. కాగా భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సోమవారం ఉదయం శారదా పీఠాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన విషయమై స్వరూపానందేంద్ర స్వామీజీతో చర్చించారు. సనాతన పీఠాల ద్వారానే సమాజంలో శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయన్నారు.