రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం వైయస్ జగన్కు ఆహ్వానం
16 Aug 2022 5:36 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ను కలిసి స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి (కాణిపాకం, చిత్తూరు జిల్లా) బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన పూతలపట్టు ఎమ్మెల్యే యం.యస్.బాబు, కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఏ. మోహన్రెడ్డి, ఆలయ ఈవో ఎం.వీ. సురేష్ బాబు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు, దీంతో పాటు ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు.
ఆహ్వానపత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన ఆలయ వేద పండితులు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో కే. విద్యాసాగర్ రెడ్డి, ఎం. చంద్రశేఖర్రెడ్డి, వి. మార్కండేయ శర్మ, ఎం. శ్రీనివాస శర్మ పాల్గొన్నారు.