టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
29 Jul 2021 3:12 PM
ఇంటర్నేషనల్ టైగర్స్ డే కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టైగర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. పులుల దినోత్సవం సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అడవుల్లో స్వేచ్ఛగా జీ వించడం వన్యప్రాణుల హక్కని, వాటి స్వేచ్ఛా జీ వితానికి ఆటంకం కలిగించడం, వేటాడడం పెద్ద నేరమన్నారు. ఇటీవల పులులు సంచరించడం అ డవుల సంరక్షణ వృద్ధికి శుభసూచకమన్నారు. కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్ ప్రతీప్ కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.