22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
సీఎం వైయస్ జగన్ పాలనకు అవార్డులే నిదర్శనం
23 Mar 2021 2:22 PM
హోం మంత్రి సుచరిత
గుంటూరు: సీఎం వైయస్ జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుందని.. దీనికి నిదర్శనం పోలీసు వ్యవస్థకు వచ్చిన అవార్డులేనని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. దేశంలోనే మొదటిసారి పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వండం ఏపీలోనే జరిగిందని తెలిపారు. మంగళవారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భధ్రతపై అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. శిథిలావస్థలో ఉన్నా పోలీసు భవనాలను నాడు-నేడు స్ఫూర్తితో పున:నిర్మించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. మహిళ పోలీసుల ఇబ్బందులను పరిష్కరించేందుకు దాతల సహకారంతో మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు స్టేషన్లకు ఐఎస్ఓ మార్క్ అరుదుగా వస్తుందని చెప్పారు. నెల్లూరులోని ఒక పోలీసు స్టేషన్కు, ఐదు దిశ పోలీసు స్టేషన్లకు ఐఎస్ఓ గుర్తింపు రావడం గర్వకారణమని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.