రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం చంద్రబాబుకు నచ్చదు

అందుకే పెయిడ్‌ ఆర్టిస్టులతో డ్రామాలాడిస్తున్నారు

గత ఐదేళ్లు రాష్ట్రంలో రాక్షసపాలన సాగింది

పోలీస్‌ వ్యవస్థను కించపరిచేలా బాబు మాట్లాడడం తగదు

సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో నేరాల సంఖ్య తగ్గింది

పల్నాడులో ప్రశాంతతకు భంగం కలిగించొద్దు

హోంశాఖ మంత్రి సుచరిత

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం చంద్రబాబుకు నచ్చడం లేదు. అందుకే పెయిడ్‌ ఆర్టిస్టులతో పల్నాడు ప్రాంతంలో ఏదో జరిగిపోతుందంటూ కుట్రలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 అంటే చంద్రబాబు పాలన చేసిన ఐదేళ్లు రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందన్నారు. సచివాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో కలిసి హోంశాఖ మంత్రి సుచిరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. లాండ్‌ ఆర్డర్‌ సక్రమంగా పనిచేస్తుంది. నేరాల సంఖ్య కూడా తగ్గింది. చంద్రబాబుకు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే నచ్చడం లేదు. అందుకే పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకువచ్చి పల్నాడులో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని డ్రామాలు ఆడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు గ్రామాలను సందర్శించారు. అక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. శిబిరాలకు కూడా పోలీసు అధికారులకు పంపిస్తున్నాం. అక్కడ భయానక ప్రాంతం ఉంటే పోలీస్‌ ప్రొటెక్షన్‌తో ప్రజలకు గ్రామాలకు తీసుకెళ్తామని హోంమంత్రి చెప్పారు.

గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో లాండ్‌ ఆర్డర్‌ గాలికొదిలేశారు. టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. గురజాలలో గత ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌ చేస్తున్నాడని గురువాచారి అనే వ్యక్తి కంప్లయింట్‌ ఇస్తే అతన్ని వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. యరపతినేని శ్రీనివాసరావు ఒక వ్యక్తిని రూ. కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు దిగాడు. చివరకు అతన్ని గ్రామంలో కూడా తిరగనివ్వలేదు. ఇలాంటి దుర్మర్గమైన పాలన చేసిన చంద్రబాబు ఇప్పుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అవాకులు పేలడం విడ్డూరం ఉందని హోంమంత్రి సుచరిత అన్నారు.

గ్రామాలకు నీరు సక్రమంగా అందింది. రైతులు వారి పనుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు ఏమీ లేవు. పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉంది. కులాలు, మతాలు, ప్రాంతాలు చూడొద్దు.. సంక్షేమం అనేది ప్రధానం, అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పోలీస్‌ డిపార్టుమెంట్‌ను కూడా కించపరిచేలా చంద్రబాబు మాట్లాడడం తగదని హోంమంత్రి హెచ్చరించారు.

Back to Top