మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బాధిత కుటుంబాలను అప్పుడెందుకు పరామర్శించలేదు లోకేష్?
23 Aug 2021 1:35 PM
హోం మంత్రి మేకతోటి సుచరిత
గుంటూరు: టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మహిళలపై దాడులు జరిగితే మంత్రి హోదాలో ఉన్న లోకేష్ అప్పుడెందుకు పరామర్శించలేదని హోం మంత్రి మేకతోటి సుచరిత నిలదీశారు. టీడీపీ పాలనలో దాడికి గురైన తహశీల్దార్ వనజాక్షి, విద్యార్థినులు రిషితేశ్వరి, సుగాలి ప్రీతి కుటుంబాల ఇళ్లుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో దిశ ఘటన జరిగితే మన రాష్ట్రంలో దిశ చట్టం తెచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిదని గుర్తు చేశారు.మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సీఎం వైయస్ జగన్ పైకి తీసుకువస్తున్నారని తెలిపారు. దిశ యాప్ను ఇప్పటి వరకు 40 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. రమ్య ఘటనపై సీఎం వైయస్ జగన్ వెంటనే స్పందించారని, బాధిత కుటుంబానికి రూ.14.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇంటి పట్టా కూడా అందించారని మంత్రి సుచరిత వివరించారు.