చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
02 Aug 2020 4:04 PM
ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు, ఇంటికో ఉద్యోగం
విశాఖ: విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్యార్డ్లో జరిగిన ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి షిప్యార్డు యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అదే విధంగా మృతుల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. కాగా, ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. షిప్ యార్డ్ మృతులకు రూ.50లక్షల పరిహార ప్రకటనపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెద్దమొత్తంలో ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకుగాను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి కార్మిక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.