మృతుల కుటుంబాల‌కు భారీ ప‌రిహారం

ఒక్కో కుటుంబానికి రూ.50 ల‌క్ష‌లు, ఇంటికో ఉద్యోగం

విశాఖ: విశాఖ‌ప‌ట్నంలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో జ‌రిగిన‌ ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి షిప్‌యార్డు యాజ‌మాన్యంతో జరిపిన చర్చలు సఫలమ‌య్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ప‌రిహారం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అదే విధంగా మృతుల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. కాగా, ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. షిప్‌ యార్డ్‌ మృతులకు రూ.50లక్షల పరిహార ప్రకటనపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెద్దమొత్తంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకుగాను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కార్మిక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top