వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అది టీడీపీ కాదు.. టీజేపీ పార్టీ
20 Aug 2020 12:42 PM
విశాఖను అభివృద్ధి చేసినట్లు బాబు రుజువు చేస్తారా?
విశాఖ నగరానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే పరిపాలనా రాజధాని ప్రకటించారు
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం : వాళ్లది తెలుగు దేశం పార్టీ కాదని, ట్విట్టర్ జూమ్ పార్టీ( టీజేపీ) అంటూ వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ అభివర్ణించారు. కరోనాకు భయపడిన ప్రతిపక్ష నేత హైదరాబాద్లో దాక్కొన్ని జూమ్ యాప్లో ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్కు మించి విశాఖను చంద్రబాబు అభివృద్ధి చేసినట్లు రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. విశాఖలో గురువారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నిరూపిస్తే..రాజీనామాకు సిద్ధం..
విశాఖ అభివృద్దిలో నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి...నేడు సీఎం వైయస్ జగన్ మాత్రమే కనిపిస్తారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అన్నారు. వైయస్సార్ హయాంతో పాటు నేడు సీఎం వైయస్ జగన్ హయాంలో విశాఖలో జరిగిన అభివృద్దిని మించి చంద్రబాబు చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామాకి సిద్దమని గుడివాడ చంద్రబాబుకి సవాల్ విసిరారు. విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు విశాఖపై ఎందుకు విషం కక్కుతున్నారో అర్ధంకావటం లేదన్నారు. విశాఖ నగరానికి మేలు చేయాలనే ఉద్దేశంతో సిఎం వైయస్ జగన్ పరిపాలనా రాజధాని ప్రకటించినప్పటి నుంచి విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి నిర్మాణం పెద్ద స్కామ్..
విశాఖలో అన్నిప్రాంతాల ప్రజలు సంతోషంగా నివసిస్తుంటే ఈ నగరంపై చంద్రబాబు బురదజల్లుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 22 ఏళ్లలో విశాఖకి ఏం చేశారని ప్రశ్నించారు. మీ హయాంలో విశాఖకి చేసిన మేలు ఏమైనా ఉందా అని అడిగారు. రాష్డ్ర విభజన సమయంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి మీరు అమరావతిలో రాజధాని ఎందుకు పెట్టారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అనేది పెద్ద స్కామ్ అని...మూడు పంటలు పండే భూములని రాజధాని పేరుతో తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది నిజం కాదా అని గుడివాడ ప్రశ్నించారు. టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓడిపోయారో చెప్పాలని గుర్తుచేశారు. మైసూరు బొండాంలో మైసూరు లేనట్లు అమరావతి రాజదానిలో రాజధానిలేదన్నారు.ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు ఆధారాలు చూపలేకపోయారని ప్రశ్నించారు.
తాను కూడా ఆరోపించగలను
చంద్రబాబు పది మర్డర్లు...లోకేష్ 20 మానభంగాలు చేశారని తాను కూడా ఆరోపించగలనన్నారు. విశాఖని అమ్మకానికి ఎపుడు పెడదామా అన్న చరిత్ర చంద్రబాబుదని ఉదహరించారు. విశాఖలో 20 లక్షలకోట్ల పెట్టుబడులు...43 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబుపై ఫిర్యాదు చేయాలనుకున్నా.. ఆయన మానసిక స్ధితి చూసి వదిలేశామన్నారు. విశాఖపై చంద్రబాబు ఎందుకు పగబట్టారో అర్ధం కావటం లేదన్నారు.
చంద్రబాబు ఉచ్చులో పడొద్దు
చంద్రబాబు ఉచ్చులో పడవద్దని విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలని తాను కోరుతున్నట్లు అమర్నాథ్ స్పష్టం చేశారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై చంద్రబాబు చెప్పిన మాటలు తర్వాత మాకు అనుమానాలు కలుగుతున్నాయని...చంద్రబాబు ఆమ్మోనియం నైట్రేట్ పేలుళ్లకి పాల్పడే కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మీ హయాంలో జరిగిన భూకుంభకోణాలు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని గుడివాడ ఆరోపించారు. కరోనాపై చర్యల విషయంలో దేశంలోనే ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా ఉందన్నారు. మీ అక్రమాలు బయటపడితే ఇతర దేశాలకి పారిపోవాల్సిందే అని గుడివాడ ఎద్దేవా చేశారు.