గణపవరంలో సీఎం వైయ‌స్ జగన్‌కు ఘన స్వాగతం

ఏలూరు: గణపవరం చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌కు మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కాసేపట్లో వైయ‌స్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రారంభించనున్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా ఈ నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. 

Back to Top