ప్ర‌తి ప‌నిని క్షేత్ర‌స్థాయిలో ఆలోచించి చేస్తారు

వైద్య‌రంగంలో 30 వేలకుపైగా పోస్టులు భ‌ర్తీ చేస్తున్న ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ది

ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: ప్రతి మనిషికి మనోధైర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రతి క్షణం ఆలోచన చేస్తున్నారని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణం శివారులో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానంలు కలిసి ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ మహమ్మారితో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ ఉంటే తగ్గిపోతుంనన్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఏ విధంగా వస్తుందో అలాగే కరోనా కూడా తొందరగానే నయమవుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ప్రతి ఒక్క పనిని క్షేత్ర స్థాయి నుంచి ఆలోచిస్తారన్నారు. అందులో భాగంగానే కోవిడ్ కేర్‌ సెంటర్‌లలో ఆహారం కూడా మెనూ ప్రకారం అందింస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 30 వేలకు పైగా వైద్యుల పోస్టులను భర్తీ చేస్తున్న ఘనత సీఎం వైయ‌స్‌ జగన్‌దేనని ప్రశంసించారు. 13 మెడికల్‌ కళాశాలలను సీఎం వైయ‌స్‌ జగన్‌ త్వరలో ప్రారంభించబోతున్నార‌న్నారు.

Back to Top