పోర్ట్స్‌ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

రాష్ట్ర మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి

  విజయవాడ: కేంద్రం తీసుకొచ్చిన పోర్ట్స్‌ బిల్లు సమాఖ్య స్ఫూర్తి విరుద్ధంగా ఉందని  పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వర్చువల్‌ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  మారిటైం స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లో పోర్ట్స్ బిల్లుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోర్టులపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలన్నారు. కేంద్రం చేసే మంచి నిర్ణయాలకు సహకరిస్తామన్నారు. నెల రోజుల్లో ఈ బిల్లును పూర్తిగా స్టడీ చేసి నివేదిక ఇస్తామని గడువు కోరామని గౌతమ్‌రెడ్డి అన్నారు.

Back to Top