టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
వైయస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు ఊరట
25 Mar 2019 4:01 PM
ఏపీ ప్రభుత్వ స్టే పిటిషన్ నిరాకరణ
నామినేషన్ వేసుకోవచ్చని తెలిపిన హైకోర్టు
హిందూపురం వైయస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్కు ఊరట లభించింది.ట్రిబ్యునల్ తీర్పును ఏపీ హైకోర్టు సమర్థించింది.ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటిషన్ను హైకోర్టు నిరాకరించింది.గోరంట్ల మాధవ్ నామినేషన్ వేయొచ్చని హైకోర్టు పేర్కొంది. రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెంబరు 30న గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితమే వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయనకు నామినేషన్ విషయంలో అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.