మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్‌ ఫ్రై డే సందేశం

సీఎం వైయస్‌ జగన్‌

తాడేప‌ల్లి: కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం.  ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రై డే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్‌ లోకానికి ఇచ్చిన సందేశాలు అని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్  పేర్కొన్నారు.

Back to Top