ఉత్సాహంగా `గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం`

అమ‌రావ‌తి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.

అన్ని జిల్లాల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే  పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైయ‌స్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు ఆశీర్వదించారు.  

Back to Top