అధికార లాంఛ‌నాల‌తో పెనుమత్స అంత్య‌క్రియ‌లు

అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజు  పార్ధివ దేహానికి అధికార లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజు  విశాఖ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. పెనుమ‌త్స మృతిప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top