మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ప్రజా సంక్షేమమే వైయస్ జగన్ ప్రభుత్వ ధ్యేయం
18 Jan 2023 1:06 PM
గడేకల్లులో `గడప గడపకు మన ప్రభుత్వం`లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి
ఉరవకొండ: ప్రజా సంక్షేమమే వైయస్ జగన్ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వైయస్ఆర్ సీపీ నాయకులు విశ్వేశ్వర్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలను, ఇప్పటి వరకు ప్రతీ ఇంటికి అందిన లబ్ధిని వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.