కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

పేదవాడి చదువు కోసం సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద

ఉరవకొండలో రూ.1.58 కోట్లతో `మ‌న‌బ‌డి నాడు-నేడు` ప‌నుల‌కు భూమిపూజ చేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి

ఉరవకొండ: కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఉరవకొండలో సెంట్రల్ ఉన్నత పాఠశాలలో రూ.77 లక్షలు, చౌడేశ్వరి కాలనీ ప్రాథమిక పాఠశాలలో రూ. 21 లక్షలు, లక్ష్మీ నరసింహ కాలనీ పాఠశాలలో రూ.60 లక్షలతో చేపట్టిన "నాడు నేడు" పథకం రెండో దశ కింద అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి విద్య, వైద్యం, సంక్షేమం అత్యంత ప్రధానమైన  అంశాలు అని అన్నారు. అందులో భాగంగానే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రూ.1.58 కోట్లతో మనబడి నాడు-నేడు పనులకు శంకుస్థాపన చేశామన్నారు. 

అభివృద్ధి, సంక్షేమంతో  సీఎం వైయ‌స్ జగన్ రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. పేదవాడి చదువు కోసం సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద పెట్టారని అన్నారు. కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. గతంలో పాఠశాలల అభివృద్ధి లేక విద్యార్థుల డ్రాపవుట్స్ శాతం అధికంగా ఉండేవన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక  ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ ఫుల్ బోర్డు పెట్టాల్సివస్తుందన్నారు. రాష్ట్రంలో మన బడి నాడు - నేడు కార్యక్రమంలో 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. ఏ ఒక్క పేద విద్యార్థి చదువును ఆర్థిక సమస్య అడ్డుకోరాదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

తాజా వీడియోలు

Back to Top