దివంగత సీఎం వైయ‌స్ఆర్‌ సేవలు చిరస్మరణీయం

అమ‌రావ‌తి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్టర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని ఆస్ట్రేలియా లోని ప్రవాస భారతీయులు కొనియాడారు. వైయ‌స్ఆర్‌ చేసిన గొప్ప పనులు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 న దివంగత మహానేత వైయ‌స్సార్ వర్ధంతిని పురష్కరించుకుని ముందస్తుగా ఘన నివాళులు అర్పించారు. ఆస్ట్రేలియా లోని ప్రవాస భారతీయులు. బ్రిస్బేన్ నగరంలో జరిగిన ఈ  కార్యక్రంమలో పలువురు  ఎన్నారైలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  ఏపీఎన్‌ఆర్‌టీ  ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి , రామకృష్ణ  రెడ్డి వల్లూరి ,బిజివేముల రఘు రెడ్డి, కర్రి శ్రీనివాస్ ,అల్లం యుగంధర్ రెడ్డి , కోట శ్రీనివాస్‌రెడ్డి, కనుబుద్ది సురేష్, గాదె విజయేందర్, కిషోర్, చాగంటి వంశీ, బొమ్మిరెడ్డి జస్వంత్, మందా రామకృష్ణారెడ్డిలతో పాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. 
ఈ కార్యకమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు  పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ముస్తఫా, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్ వెంకట్ మేడపాటి , చల్లా మధు తదితరులు మాట​‍్లాడారు. నిర్వాహకులను అభినందించారు.

Back to Top