సంక్రాంతి కానుకగా వైయస్‌ఆర్‌ రైతు భరోసా

2020 కూడా రైతు నామ సంవత్సరమే

వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి 

 తాడేపల్లి: రైతులకు సంక్రాంతి కానుకగా ‘రైతు భరోసా’  అందచేస్తామని వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, గత సంవత్సరం తరహాలో 2020ని కూడా రైతు నామ సంవత్సరంగా కొనసాగిస్తామన్నారు.  సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నారనే ధీమా రైతుల్లో నెలకొందని ఆయన అన్నారు. ఎంవీఎస్‌ నాగిరెడ్డి బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ .... ‘ సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అందించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా కౌలు రైతులకు రైతు భరోసా అందచేశారు. వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన పీఎం కిసాన్‌ రైతు భరోసా ఒక ఏడాది ముందు నుంచే ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.2వేలు త్వరలో పడుతుంది. సీఎం జగన్‌ మొత్తం బడ్జెట్‌లో 12.66 శాతం నిధులు వ్యవసాయానికే కేటాయించారు. పగటిపూట రైతులకు 9 గంటల ఉచిత కరెంట్‌ అందిస్తున్నాం’ అని తెలిపారు.

రైతులకు ఉచితంగా పంటల బీమా చెల్లించారు. పశువులకు ఉచితంగా పశుబీమా అందించారు. చంద్రబాబు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ హామీలను నిలబెట్టుకోలేదు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నాం. చనిపోయిన రైతులను చంద్రబాబు పట్టించుకోలేదు. రైతుల కోసం ముఖ్యమంత్రి జగన్‌ ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు కేటాయించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని 15 శాతం పెంచారు.

ఆక్వా రైతులకు విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.1.50 పైసలకే అందిస్తున్నారు. వరదలు మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. పంటలకు సున్నా వడ్డీకే రుణాలు, పప్పు, చిరు ధాన్యాలకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాము. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనను రైతులకు... ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 90 శాతం ఎన్నికల హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు’ అని తెలిపారు.

బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట
భార‌త‌దేశ చ‌రిత్రలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. రాష్ట్ర బ‌డ్జెట్ రూ.2,27,974 కోట్లు అయితే వ్యవసాయానికి రూ. 28,866 కోట్లు కేటాయించారని నాగిరెడ్డి తెలిపారు. టోట‌ల్ బ‌డ్జెట్ వ్యవసాయానికి 12.66 శాతం. ఇంత కేటాయింపు దేశంలో ఏ రాష్ట్ర  బ‌డ్జెట్‌లోనూ లేదు. రాష్ట్రంలో 60 శాతం ఫీడ‌ర్‌ల‌లో మాత్రం 9 గంటల కెపాసిటి ప‌నిచేసే ప‌రిస్థితి ఉంది. మిగ‌తా 40 శాతం ఫీడ‌ర్‌ల‌లో  9 గంట‌లు ప‌నిచేయించాలంటే  వాటికి 1700 కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సింది ఉంది. అది కూడా బ‌డ్జెట్‌లో కేటాయించారు. అది కూడా క‌లిపితే రూ.30566 కోట్లు అవుతుంది. మొత్తానికి 13.4 శాతం వ్యవసాయానికి,  రైతు సంక్షేమానికి కేటాయించ‌డం జ‌రిగింది. 

టీడీపీ ఐదేళ్లలో కేటాయించిన నిధులు ఇలా.. 
2014-15లో రూ.  13110 కోట్లు
2015-16లో రూ.14184 కోట్లు ..కేవ‌లం రూ.1074 కోట్లు పెంచారు.
2016-17లో రూ.16250 కోట్లు ..రూ.2066 కోట్లు పెంచారు. 
2017-18లో రూ.18214 కోట్లు..రూ. 1964 కోట్లు పెంచారు.
2018-19లో రూ.19070 కోట్లు...రూ. 876 కోట్లు పెంచారు.

Back to Top