హత్య ఘటనపై సీఎం వైయ‌స్ జగన్‌ ఆరా

బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ప్రకటన

తాడేప‌ల్లి:  గుంటూరులో యువతి రమ్య హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలు తీసుకుని దోషికి కఠిన శిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే హోం మంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని.. పరిహారంగా రూ.10 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించారు. 

తాజా వీడియోలు

Back to Top