మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మెరుగైన వైద్యం అందించేందుకు వైయస్ జగన్ కృతనిశ్చయం
24 Aug 2019 11:00 AM
విశాఖ కేజీహెచ్లో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తనిఖీలు
విశాఖ: నిరుపేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని వైద్యులకు సూచించారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంత్రులు శనివారం తనిఖీ చేశారు. గతంలో కేజీహెచ్లో కొందరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని మరణాలు సంభవించాయని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. కేజీహెచ్లో అవినీతి పెరిగిపోయిందన్నారు. పోస్టుమార్టం కోసం కూడా లంచం తీసుకుంటున్న దుస్థితి నెలకొందన్నారు. గిరిజనులు వస్తే మీ కుటుంబ సభ్యుడిగా స్పందించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కొందరు వైద్యులు, సిబ్బంది పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.