ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
పేదల సొంతింటి కల సాకారం చేస్తాం
12 Jun 2019 4:58 PM
రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
పేదలకు దశలవారీగా ఇళ్ల నిర్మాణం
రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
అమరావతి: రాష్ట్రంలోని 25 లక్షల మంది ఇళ్ల పట్టాలిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు డిప్యూటీ సీఎం,రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాస్ చంద్రబాబోస్ తెలిపారు. మంత్రిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తమ ఛాంబర్లోకి వేదమంత్రోచ్ఛరణలతో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు దశలవారీగా వారికి ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.పాదయాత్ర హామీల అమలే ధ్యేయంగా మా పరిపాలన సాగుతుందని తెలిపారు. పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో వసతి,సౌకర్యాలు లేని పేదవారిని గుర్తించడం జరుగుతుందన్నారు.అనంతరం లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు.