అమరావతి: రాష్ట్రంలోని 25 లక్షల మంది ఇళ్ల పట్టాలిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు డిప్యూటీ సీఎం,రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాస్ చంద్రబాబోస్ తెలిపారు. మంత్రిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తమ ఛాంబర్లోకి వేదమంత్రోచ్ఛరణలతో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు దశలవారీగా వారికి ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.పాదయాత్ర హామీల అమలే ధ్యేయంగా మా పరిపాలన సాగుతుందని తెలిపారు. పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో వసతి,సౌకర్యాలు లేని పేదవారిని గుర్తించడం జరుగుతుందన్నారు.అనంతరం లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు.