ప్ర‌తి కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకుంది

వ‌ర‌ద బాధితుల‌కు ప‌రిహారం పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి

 
చిత్తూరు:   వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకుంద‌ని డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి వెల్ల‌డించారు.  ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు నూతనంగా ప‌క్కా ఇంటిని మంజూరు చేసిన‌ట్లు తెలిపారు.   శనివారం  ఉపముఖ్యమంత్రి, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ,రాష్ట్ర మొదలియర్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్  నగరంలోని సంతపేట ప్రాంతం  కైలాసపురం లో పర్యటించారు. ఈ నెల 19వ తేదీన హంద్రీ నీవా నది ఉధృతికి 7 ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోగా 173 మంది ఇళ్ల‌ల్లో కి నీరు చేరింది. బాధితుల‌కు సంబంధించి ఏడు మందికి 90 వేల రూపాయల చొప్పున పరిహారం అందించారు. 173 మంది కి 2000 రూపాయల చొప్పున అందించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా అంద‌జేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ..హంద్రీ నీవా నది ఉధృతి  ఇంకా తగ్గలేదని, ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వంలో  ప్ర‌జ‌లు ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్న‌ట్లు చెప్పారు. పరిహారం కూడా వారం రోజులు తిరగకుండానే ఇస్తున్నారని,  ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నట్లుగా తెలిపారు.

వారంలోగానే ప‌రిహారం ఇవ్వ‌డం ఆనందంగా ఉంది: .జి.గీత, కైలాసపురం

ఈ నెల 18వతేదీన భారీ వర్షం కురవడం జరిగిందని, ఎన్నడూ లేని విధంగా అకస్మాత్తుగా నది ఉధృతంగా ప్రవహించడంతో మా ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడం జరిగింది. నా భర్త శ్రీనివాసులు అనారోగ్యంతో ఉండటంతో ఆయనను బయటకు తరలించే సమయంలో ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. ఇంటితో పాటు ఉన్న సామాన్లు అన్నీ వరద ఉధృతి లో వెళ్లిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్పడం కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ఎప్పుడు ఆలస్యంగా ఇచ్చే పరిహారం వారం తిరక్కుండానే ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దీంతోపాటు ఉప ముఖ్యమంత్రి ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణాన్ని కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ఇల్లు మంజూరు అయిన వెంటనే ఇంటి నిర్మాణం చేసుకుంటాం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

సహాయ శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు:  గోవిందు, 40వ డివిజన్ 

హంద్రీ నీవా నది కి ఎన్నడూ లేని విధంగా వరదలు రావడం, ఇంట్లో ఉన్న సామాగ్రిని కొంతవరకైనా దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఇల్లు కోట్టుకుని పోవడం జరిగింది. అప్పటి నుంచి సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి సొమ్ము రావాలంటే చాలా సమయం పడుతుందని చెబుతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు తిరగకుండానే మాకు పరిహారం అందించడం ఆనందంగా ఉంది. ఈ సొమ్ముతో ప్రభుత్వం కేటాయించే స్థలంలో ఇంటిని నిర్మించుకుంటాం. సహాయ శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఇల్లు కోల్పోయిన నాకు పరిహారం వెంటనే ఇవ్వడం  ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాలంటీర్ నుంచి ప్రతి అధికారి  మా గురించి పట్టించుకుంటున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు .
 

తాజా వీడియోలు

Back to Top