తాడేపల్లి: డీఎస్సీ 2025లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్ధులు తాడేపల్లిలో మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. మెగా డీఎస్సీ పేరుతో తమను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వారు వాపోయారు. మెరిట్ను విస్మరించి రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరించిందని, తమకు న్యాయం చేయాలని వారంతా వైయస్ జగన్ను కోరారు.