సీఎం చేతుల మీదుగా పాడి రైతుల‌కు బోన‌స్ పంపిణీ

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ చేతుల మీదుగా కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) పాడి రైతులకు బోనస్‌ పంపిణీ జ‌రిగింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను కర్నూలు మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌, ఎండీ, డైరెక్ట‌ర్లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రూ. 7.20 కోట్ల బోనస్‌ చెక్‌ను సీఎంకు అంద‌జేశారు. పాడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద వల్ల తమ సహకార సమితి రెండేళ్ళలో రూ. 27 కోట్లు లాభాలు గడించిందని, కర్నూలు మిల్క్‌ యూనియన్‌ సమగ్ర పనితీరును చైర్మ‌న్ వివ‌రించారు. రానున్న రోజుల్లో డెయిరీని మరింత అభివృద్ది చేసి ముందుకు తీసుకెళతామని సీఎంకి క‌ర్నూలు మిల్క్ యూనియ‌న్‌ చైర్మన్, ఎండీ, డైరెక్టర్‌లు వివ‌రించారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) చైర్మన్‌ ఎస్‌.వి. జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎండీ పరమేశ్వర రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ రాజేష్, సొసైటీ డైరెక్టర్లు జి. విజయ సింహా రెడ్డి, యు.రమణ, మహిళా పాడి రైతు ఎన్‌. సరళమ్మ ఉన్నారు. 

Back to Top