అమరావతి: అసైన్డ్ భూములపై ఈ ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం సమగ్ర భూ సర్వేపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు సుదీర్ఘంగా మాట్లాడారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు
►అసెన్డ్ ల్యాండ్స్పై గతంలో ఎవరూ దృష్టిపెట్టలేదు
►వైఎస్సార్ హయాంలో 7 లక్షల ఎకరాలు అసెన్డ్ ల్యాండ్ అందజేశారు
►లంక భూములపై సాగుదారులకు సంపూర్ణహక్కు కల్పిస్తున్నాం
►అసైన్డ్ ల్యాండ్పై సర్వహక్కులు ప్రభుత్వం కల్పిస్తోంది
►ప్రజల పక్షాన నిలబడే నాయకుడు సీఎం వైయస్ జగన్
►రెవెన్యూశాఖలో సంస్కరణలు ఎంతో మేలు చేస్తున్నాయి
►అందరూ గర్వపడేలా సంస్కరణలు తీసుకొచ్చాం
►సంస్కరణలు చేయాలంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలి.
►సీఎం వైయస్ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు
►పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నారు.
►భూములు బలవంతంగా లాక్కునే పరిస్థితులు నేడు లేవు
►అసైన్డ్ ల్యాండ్పై సర్వ హక్కులు ప్రభుత్వం కల్పిస్తోంది.
►ఈ చట్ట సవరణ ద్వారా లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది.
►ప్రభుత్వ సంస్కరణలను అంతా అభినందించాలి
►అందుకే ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం
► ఏ సంస్కరణ తీసుకొచ్చినా అవినీతి లేకుండా చేయాలనేదే సీఎం వైయస్ జగన్ సంకల్పం
►రైతుపై ఒక్క రూపాయి భారం లేకుండానే సర్వే చేశాం
►ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే పూర్తవుతుంది
►మరో రూ. 500 కోట్లు ఖర్చు పెడతాం
►4వేల గ్రామాల్లో సర్వే పూర్తయింది
►భూసర్వేకు 10వేల మంది సిబ్బందిని నియమించాం
►సర్వే కోసం ఇప్పటిదాకా రూ. 500 కోట్లు ఖర్చు పెట్టాం
►సర్వే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం
►భూసర్వే ఓట్ల కోసం చేసింది కాదు..భవిష్యుత్తు తరాల కోసం చేసింది