మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు ‘జగనన్న తోడు’ ఒక వరం
11 Jan 2023 12:52 PM
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
తాడేపల్లి: చిరువ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడిన కుటుంబాల్లో జగనన్న తోడు పథకం ఆనందాన్ని నింపిందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు జగనన్న తోడు పథకం ద్వారా అందించే రూ.10 వేల వడ్డీలేని రుణం ఒక వరంగా నిలిచిందని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు పథకం అమలు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలోని చిరువ్యాపారుల కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయన్నారు. రూ.10 వేల వడ్డీలేని రుణాలను అందిస్తూ చిరు వ్యాపారులకు, సంప్రదాయ చేతివృత్తుల వారికి ఊతం ఇచ్చారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆ కుటుంబాలకు ఐదుసార్లు జగనన్న తోడు పథకాన్ని అందించారని, నేడు ఆరో విడత అందిస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న ఆర్థిక భరోసాతో ఆ కుటుంబాలన్నీ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. గతంలో వ్యాపారం కోసం అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని ఇబ్బందులు పడేవారని, వారందరినీ సీఎం వైయస్ జగన్ ఆదుకున్నారన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి హామీలు లేకుండా అడిగిన వెంటనే రూ.10 వేలు అందించేలా చిరువ్యాపారులకు అండగా సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా నిలదొక్కకుంటున్నాయన్నారు.