మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఆహార నాణ్యతపై కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు
04 Aug 2020 5:22 PM
ప్రైవేట్ ఆస్పత్రులు అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు
కర్నూలు కోవిడ్ ఆస్పత్రిలో అందుబాటులో 3,880 బెడ్లు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
కర్నూలు: కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కర్నూలు జిల్లాలో మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. కోవిడ్ నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలులో జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నది వాస్తవమేనన్నారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. టెస్టుల సంఖ్య పెంచడంతోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా నిర్ధారణ అవుతున్నాయన్నారు. గతంలో కంటే టెస్టింగ్ ల్యాబ్ సామర్థ్యాన్ని పెంచామన్నారు. లాక్డౌన్ ఎత్తివేయడం, కోవిడ్ పరీక్షలు ఎక్కువ చేయడంతో కేసులు పెరుగుతున్నాయని వివరించారు. కర్నూలు కోవిడ్ ఆస్పత్రిలో 3,880 బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కోవిడ్ సెంటర్లలో ఆహార నాణ్యతపై కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదన్నారు. ఆహారంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, అదేవిధంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.