కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఐదు రోజులుగా నమోదు కాని కరోనా మరణాలు
30 Apr 2020 12:46 PM
ఏపీలో కొత్తగా 71 కరోనా కేసులు
వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా కేఎస్ జవహర్రెడ్డి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా మరణాలు నమోదు కాలేదని, అలాగే ఇన్ఫ్క్షన్తోపాటుగా, మరణాల రేటు కూడా తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా కేఎస్ జవహర్రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కి చేరింది. ఈ మేరకు కేఎస్ జవహర్రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
గడిచిన 24 గంటల్లో 6497 శాంపిల్స్ను పరీక్షించగా 71 మంది కరోనా నిర్ధారణ అయిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
కొత్తగా అనంతపురం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 3, తూర్పు గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 4, వైయస్ఆర్ జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 43, నెల్లూరు జిల్లాలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 94, 558 కరోనా పరీక్షలు నిర్వహించిన ఏపీ దేశంలోనే నంబర్ వన్గా నిలించిందని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా కేఎస్ జవహర్రెడ్డి వివరించారు.