కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
టీటీడీ నమూనా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి
01 Jul 2019 10:41 PM
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని టీటీడీ అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. తుళ్లూరు మండలం వెంకటాపాలెంలో నిర్మిస్తున్న ఆలయం పునాది నిర్మాణ పనుల గురించి అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో జనవరిలో స్వామి వారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతున్న పనుల గురించి సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఉపరితలమంతా రాతి కట్టడం కావడంతో మూడు ప్రాంతాల్లో ఆకృతులకు సంబంధించి పనులు జరుగుతున్నట్లు టీటీడీ ఛీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి వివరించారు. ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఆలయ పునాదుల కు సంబంధించి ఎర్త్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంత ప్రజలు శ్రీవేంకటేశ్వర స్వామిని సేవించుకునేందుకు టీటీడీ కృషి చేస్తుందని తెలిపారు.