ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం వైయస్ జగన్ పాలన
26 Nov 2020 11:35 AM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ చిత్తశుద్ధితో బాధ్యతలు నెరవేరుస్తున్నారని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత, విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్ అండ్ బి మంత్రి శంకర నారాయణ, వైయస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, జెల్లీ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు నారుమల్లి పద్మజ, నారాయణ మూర్తి తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కృషి కారణంగానే భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని అన్నారు. ప్రజలకు సంక్రమించిన అనేక హక్కులు రాజ్యాంగ ఫలితమే అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రాజ్యాంగానికి ఎలా తూట్లు పొడిచాయో మనం చూశాం. చివరికి ప్రతిపక్ష పార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లారు. కొన్ని వ్యవస్థలు, కొంత మంది వ్యక్తులు రాజ్యాంగాన్ని వేరే విధంగా వినియోగించుకుంటున్నాయి’’ అని గత టీడీపీ ప్రభుత్వ తీరును వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నాం: మంత్రి ఆదిమూలపు సురేష్
అంబేడ్కర్ భావజాలంతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అమరావతిలో జరిగిన అవకతవకలు చూశాం.. ఇప్పుడు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలించాలని ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అడ్డుకోవాలని చూడటం సరికాదు
ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: హోం మంత్రి సుచరిత
అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో అంటరానితనం పెద్ద రుగ్మత. దాన్ని నిర్మూలించడానికి అంబేడ్కర్ కృషి చేశారు. ఆయన కృషివ ల్లే నేడు మనకు మంచి రాజ్యాంగం అందుబాటులో ఉంది. రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం వైయస్ జగన్ ముందుడుగు వేసి, అన్ని వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదే విధంగా 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళకు స్థానం కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందాలని అనేక సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇతర రాష్ట్రాలకు మన ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది.
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి: మంత్రి శంకర నారాయణ
సమ సమాజ స్థాపన కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిది. ఆయన స్పూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారు.
రాజకీయాలకు అతీతంగా పాలన: వెల్లంపల్లి శ్రీనివాస్
ప్రాథమిక హక్కులను గత ప్రభుత్వం కాలరాసింది. దళితులకు, అణగారిన వర్గాలకు అందించాల్సిన పథకాలు గతంలో అందించలేదు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం వైయస్ జగన్ పాలన సాగిస్తున్నారు.