భ‌గీర‌థ మ‌హ‌ర్షికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: భ‌గీర‌థ మ‌హ‌ర్షి జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌ వేసి నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఏపీ సగర, ఉప్పర వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ జి.రమణమ్మ, గిద్దలూరు వైయ‌స్‌ఆర్‌సీపీ పరిశీలకుడు బంగారు శీనయ్య హాజ‌ర‌య్యారు.

Back to Top