విజయవాడ: ‘‘మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు మహావృక్షాలై ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటున్నా. చదువులమ్మ గుడులుగా మారుతున్న గవర్నమెంట్ బడుల నుంచి టెన్త్, ఇంటర్ టాపర్లుగా నిలిచిన ఆణిముత్యాలకు, విద్యారత్నాలకు, మన భావి ప్రపంచ పౌరులకు నిండుమనసుతో, గుండెల నిండ ప్రేమతో మీ జగన్ మామ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాడు’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. టెన్త్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, స్కూల్ స్థాయిల్లో టాప్–3 ర్యాంకర్లుగా నిలిచిన విద్యార్థులను సత్కరించే ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాన్ని వినిపించారు. ప్రభుత్వ బడుల్లో, విద్యారంగంలో జరుగుతున్న మార్పులను, పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించడం కోసం ప్రభుత్వం వేస్తున్న అడుగులను ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ వివరించారు. సీఎం వైయస్ జగన్ పూర్తి ప్రసంగం.. ‘‘రాష్ట్రంలో కల్లా ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్మైండ్స్, షైనింగ్ స్టార్స్, ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ. ప్రతిభ కనబర్చిన మీకు, మీ తల్లిదండ్రులకు, మీకు గొప్పగా చదువులు చెప్పిన టీచర్లందరికీ గ్రాండ్ వెల్కం. ప్రతి ముఖంలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ప్రతి ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఇవి నిజంగా నాకు చాలా నచ్చాయి. మిమ్మల్ని చూస్తుంటే గవర్నమెంట్ బడి, కాలేజీలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక మరింత పెరుగుతోంది. పేద పిల్లలు ఏ ఒక్కరూ కూడా పేదరికం వల్ల దూరం కాకూడదని మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది కాబట్టే.. పిల్లలు వెళ్లే గవర్నమెంట్ బడి నాడు–నేడు ద్వారా రూపురేఖలు మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిల్లలకు అందించే మిడ్డే మిల్స్ కూడా జగనన్న గోరుముద్దగా మార్పు చేసి అందించగలుగుతున్నాం. బడులు తెరిచే సమయానికల్లా జూన్లోనే జగనన్న విద్యా కానుక ప్రతి చిట్టి తల్లి, బాబు అందుకుంటున్నారు. ఈ నాలుగేళ్లలోనే పిల్లలు చదువుకుంటున్న మీడియం ఇంగ్లిష్కు మారింది. మొట్టమొదటి సారిగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. పాఠ్యపుస్తకాల సిలబస్ మారింది. బైలింగ్వెల్ టెక్ట్స్బుక్స్ తీసుకొచ్చాం. బైజూస్ కంటెంట్ కూడా గవర్నమెంట్ బడుల్లోని మన పిల్లలందరికీ అందుబాటులోకి వచ్చింది. పిల్లలు చదువుతున్న బడుల్లో సదుపాయాలు, కరికుళం అన్నీ మారిపోయాయి. గతంలో క్లాస్ టీచర్లు సరిగ్గా ఉంటారా.. ఉండరా అన్న పరిస్థితి నుంచి సబ్జెక్ట్ టీచర్లు 3వ తరగతి నుంచే బోధనలు చెప్పించే గొప్ప కార్యక్రమానికి అడుగులు పడుతున్నాయి. క్లాస్లలో డిజిటల్ బోధన కొరకు 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా ఐఎఫ్బీ బిగించి డిజిటల్ బోధనతో ప్రతి పిల్లాడికి, పాపకు చదువు అనేది ఇంకా ఎఫ్టెక్టివ్గా నేర్పించే కార్యక్రమం మన గవర్నమెంట్ బడుల్లో జరుగుతుంది. 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడికి కూడా కంటెంట్ లోడెడ్ ట్యాబ్లను అందిస్తూ గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న పిల్లలను ప్రోత్సహిస్తున్నాం. మన పేదింటి పిల్లలందరూ కూడా అంతర్జాతీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3వ తరగతి నుంచి వారిని టోఫెల్ పరీక్షకు సిద్ధం చేస్తూ.. అంతర్జాతీయ సర్టిఫికేషన్ కూడా పిల్లలకు అందించే గొప్ప అడుగు మన గవర్నమెంట్ బడుల్లో పడుతుంది. పిల్లలు ఇంగ్లిష్లో వినడం, మాట్లాడటం రెండింటిలోనూ అంతర్జాతీయస్థాయిలో పోటీపడే పరిస్థితి తీసుకురావడం కోసం టోఫెల్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించాం. గవర్నమెంట్ బడుల్లో ఇలాంటి మార్పులు రాగలుగుతాయా..? సాధ్యమయ్యే పనేనా అనే పరిస్థితి నుంచి ఇవన్నీ మన గవర్నమెంట్ బడులే.. గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు పోటీపడక తప్పదు అనే పరిస్థితి నా ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి అన్నగా, తమ్ముడిగా వారి పిల్లలందరికీ మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ మనసా, వాచా, కర్మణా వారందరికీ తోడుగా నిలబడుతూ ఈరోజు మీ జగన్ మేనమామ ప్రభుత్వంలో ఇవన్నీ గవర్నమెంట్ బడుల్లో జరుగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కనీసం ప్రతి ఒక్కరూ డిగ్రీ చదవాలి. జీఈఆర్ రేషియోలో ఇప్పుడున్నవాటికి మార్పులు రావాలి. ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలి.. డిగ్రీతో బయటకు రావాలి. ఈ డిగ్రీతో బయటకు వచ్చే కార్యక్రమంలో పేద పిల్లవాడి కోసం వారి తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా.. ఆ ప్రతి పిల్లాడికి డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉండాలనే తపన, తాపత్రయంతో దేశంలో ఎక్కడా జరగని విధంగా విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నా.. డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి చదువులకు మొత్తం ఫీజులన్నీ మన ప్రభుత్వమే భరిస్తూ.. విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా.. ప్రపంచంలో టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్లో దాదాపుగా 350 విదేశీ కాలేజీల్లో ప్రతి పిల్లాడికి చెప్పాం.. మీరు సీటు తెచ్చుకోండి, మీకు తోడుగా మీ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏకంగా ఫీజులు రూ.1.25 కోట్లు అయినా కూడా మీరు భయపడాల్సిన పనిలేదు.. సీటు తెచ్చుకుంటే మీకు తోడుగా మీ మేనమామ ప్రభుత్వం ఉంటుందని ప్రతి పాపకు, బాబుకు భరోసా ఇచ్చాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా జరగని విధంగా చదువులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపించేలా తల్లులకు అమ్మఒడి అనే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వం మనది చెప్పడానికి గర్వపడుతున్నా.. ఎందుకీ మార్పులు అంటే.. కారణం మన పిల్లలందరూ ప్రతి రంగంలోనూ ఎదగాలి. ఎదగడం కూడా కాదు.. ఎగరాలి. ప్రపంచంలో వస్తున్న ఇన్వెన్షన్, ఇన్నోవేషన్స్ను అనుసరించేలా మనవాళ్లు ఉండకూడదు. ప్రతి రంగంలోనూ ప్రపంచానికి లీడర్లుగా మన పిల్లలు ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. ఇది జరగాలంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మార్పు రావాలి. అందుకనే ఈ నాలుగు సంవత్సరాల్లో మన ప్రభుత్వం పెట్టిన ధ్యాస దేశంలో బహుశా ఎవరూ పెట్టిఉండరు. అంతగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద అంతగా ధ్యాసపెట్టాం. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్లో రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ బడుల్లో ఐబీ సిలబస్ కూడా తీసుకువచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. పరీక్షల పేపర్లు రాసే పరిస్థితిని కూడా మార్చాలి. పరీక్షలంటే కేవలం చదువుకొని, ఆన్సర్స్ను మెదడులోకి డ్రిల్ చేసి రాయడం కాకుండా.. ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ మాదిరిగానే మన పిల్లలకూ పరీక్షలకు వెళ్లేటప్పుడు టెక్ట్స్బుక్ కూడా మీరు తీసుకువెళ్లొచ్చు.. అయినా పర్వాలేదు అని చెప్పే పరీక్షా విధానంలో కూడా ప్రాక్టికాలిటీకి దగ్గరగా, క్వశ్చన్స్ అన్నీ అనలెటికల్గా ఇంటర్నేషనల్ సిలబస్లో ఏ మాదిరిగా పరీక్ష పత్రాలు ఉంటాయో.. ఆ మాదిరిగా కూడా మన పరీక్షా పత్రాలు కూడా రాబోయే రోజుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ బడుల్లో అట్టడుగున ఉన్న నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు చదువుకుంటున్నారు. ఈ పిల్లలంతా ప్రపంచాన్ని ఏలే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజును కచ్చితంగా మనం చూస్తాం. ఆ స్థాయిలో మార్పులన్నీ జరుగుతున్నాయి. నిరుపేద వర్గాలు కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని కాదు.. ప్రపంచాన్ని శాసించే స్థాయిలోకి మన పిల్లలు వెళ్తారు. అందుకనే ఈ వయసు నుంచే మీ ఆలోచనల్లో అత్యంత ఎల్తైన శిఖరం మన గోల్ కావాలనే ఫైర్ మన మనసులో ఉండాలి. బ్యాలెన్డ్స్ అండ్ మెచ్యూర్డు థాట్తో పాటు ఈ ప్రపంచాన్ని మారుస్తున్న టెక్నాలజీస్, ప్రపంచంలో మారుతున్న చదువుల గురించి మన పిల్లలందరూ తెలుసుకోవాలి, ఆలోచనలు చేయాలి. లీడర్షిప్ క్వాలిటీస్ పెంచే విధంగా మన చదువులు ఉండాలి. చదువుల్లో మార్పులు వేగంగా మారుతున్నాయి. టెన్త్, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్, మెడిసిన్, లేదా ఏదో ఒక డిగ్రీ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా.. ప్రపంచాన్ని శాసించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మెషిన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎం, చాట్ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలందరూ.. మారుతున్న ప్రపంచంలో మనం ఎక్కడున్నాం.. మనం ఎంతగా ఎదగాలనేది ప్రతి మెదడులో ఆలోచనలు రావాలి. రాబోయే రోజుల్లో చదువు ఈ మాదిరిగా, కాంపిటీషన్ అనేది ఈ మాదిరిగా ఉండదు. మనం వేగంగా మారకపోతే ఎక్కడుంటామో మనకే తెలియని పరిస్థితిలోకి వెళ్తాం. ఆ స్థాయిలో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎల్ఎల్ఎం, చాట్ జీపీటీ యుగంలో ఎడ్యుకేషన్ రంగమే పూర్తిగా మారుతుంది. ఈ మార్పును ప్రతి పేదవాడికి తీసుకురావాలి, ప్రతి పేద కుటుంబం కూడా ఈ మార్పుల్లో భాగస్వామ్యం కావాలి. అప్పుడే మనం ప్రపంచాన్ని ఏలగలుగుతామని ప్రతి పిల్లాడూ గుర్తుపెట్టుకోవాలి. టాప్ ర్యాంక్లు తెచ్చుకున్న మీరే కాదు, మీతో పాటు ఏ ర్యాంక్ తెచ్చుకోలేని వారు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. సంకల్పం అనేది గట్టిదైతే రిజల్ట్స్ ఆటోమెటిక్గా వస్తాయని వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. మాణిక్యాలన్నీ మట్టిలోనే పుడతాయి.. అరక దున్నినప్పుడే వజ్రాలు బయటకు వస్తాయని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. డబ్బులున్న వారికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ బడుల్లో చదువుకోలేకపోతే ఏదో అవకాశం పోయిందని ఏ ఒక్కరూ బాధపడాల్సిన పనిలేదు. ఏ ఒక్క పాప, బాబు, వారి తల్లిదండ్రులు బాధపడాల్సిన పనిలేదు. మన గవర్నమెంట్ బడి నుంచి అంతకుమించి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.. గవర్నమెంట్ బడికి జీవం పోస్తూ ఆణిముత్యాలను సత్కరించే కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న ఈ పిల్లలను రాబోయే రోజుల్లో ప్రపంచానికి చూపించే రోజు వస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను.. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లో చదువుకొని ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, ఆయా స్కూళ్లు, కాలేజీల స్థాయిల్లోనూ నాలుగు కేటగిరీస్లో టాప్–3గా నిలిచిన పిల్లలు మరింత వారు చదువుకోవాలని, రాణించాలని, మరింత మంది పిల్లలకు వీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ వీరందరినీ రాష్ట్రానికి పరిచయం చేస్తూ అడుగులు వేస్తున్నాం. ఈ నాలుగు స్థాయిల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది ఆణిముత్యాలుగా నిలిచిన మొత్తం 22,768 మంది పిల్లలను సత్కరించడం జరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా పేద పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సన్మానం, ఇది పరోక్షంగా గవర్నమెంట్ బడికి, ఆ బడుల్లో పాఠాలు చెబుతున్న టీచర్లకు సన్మానం. మరోసారి మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ సంవత్సరం కంటే వచ్చే ఏడాదికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంకా గొప్ప మార్పులు చూపిస్తాం.. ఇంకా బెటర్ రిజల్ట్స్తో ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను. నేను సత్కరించే 88 మంది పిల్లల డేటా అడిగాను. ఎస్ఎస్సీలో బాలురు 18 మంది ఉంటే.. బాలికలు 24 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్లో బాలురు 4గురు ఉంటే బాలికలు 22 మంది.. ఇది నిజంగా ఆడపిల్లలను బడులకు పంపించాలని ప్రతి తల్లిదండ్రిని ప్రోత్సహించే గొప్ప నంబర్ అని తెలియజేస్తున్నాను.