తాడేపల్లి: గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ జవహర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.