రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం వైయ‌స్ జగన్‌

 అమ‌రావ‌తి: విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ బుధవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి 11.30 గంటలకు శ్రీ శారదా పీఠం చేరుకుంటారు. ఒంటిగంట వరకు అక్కడ ఉంటారు. మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు. 

Back to Top