పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
నేడు `జగనన్న చేదోడు`
08 Feb 2022 10:34 AM
వరుసగా రెండో ఏడాది పథకం అమలు
కాసేపట్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలోని రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ``జగనన్న చేదోడు`` పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. కాసేపట్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి 2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 285.35 కోట్లు జమ చేయనున్నారు. షాపులున్న రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు `జగనన్న చేదోడు` కింద రూ.10వేల ఆర్ధిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం ఏటా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దఫా షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు, షాపులున్న 98,439 మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40.81 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం వైయస్ జగన్ జమ చేయనున్నారు. నేడు విడుదల చేయబోయే రెండో ఏడాది నగదుతో కలిపి.. ఇప్పటి వరకూ జగనన్న చేదోడు కింద రూ.583.78 కోట్లు రాష్ట్రంలోని రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు అందించినట్టు అవుతుంది.