రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
అమీన్ పీర్ దర్గాను సందర్శించడం నా అదృష్టం
23 Dec 2022 3:03 PM
కడప పెద్ద దర్గాలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు
ప్రభుత్వ లాంఛనాలతో దర్గా మజర్ల వద్ద పూల చాదర్ సమర్పణ
కడప: మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గాను సందర్శించడం తన అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం వైయస్ జగన్ కడప అమీన్ పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి.. ప్రభుత్వ లాంఛనాలతో పూల చాదర్ సమర్పించారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన అమీన్ పీర్ దర్గా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దర్గా ప్రతినిధులు దర్గా సంప్రదాయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అమీన్ పీర్ దర్గా ప్రధాన మందిరంలోకి పీఠాధిపతి హరిఫుల్లా హుస్సేని, దర్గా కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అనంతరం దర్గా సేవలో నిరంతరం అంకితమవుతున్న దర్గా ముజావర్లు, దర్గా కమిటీ సభ్యులను, చౌదరీ కలీఫాలను.. దర్గా పీఠాధిపతులు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతులచే "సూఫీ సర్మాస్త్ సానీ షిలాక్" సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి తలపాగా (పేటా) అలంకరణ చేసి, మెడలో షేలా (కండువా), ఇలాచి (దండ) ధరింపజేశారు.
దర్గా పీఠాధిపతులతో కలిసి ముఖ్యమంత్రి అమీన్ పీర్ దర్గా గుమ్మం ముందుకు చేరుకుని నారికేళీ రాతిపై కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించుకున్నారు. అనంతరం పూలు, వస్త్ర చాదర్, సుగంధ పరిమళాల అత్తరుతో కూడిన తట్టను ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన తలపై పెట్టుకుని ప్రధాన దర్గా లోపలికి ప్రవేశించారు. అక్కడ పీరుల్లా మాలిక్ జీవ సమాధి వద్ద గుడ్డ చద్దార్, పూలమాల, అత్తరు సమర్పించిన అనంతరం వారు ఫాతెహ నిర్వహించి ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా అరీఫుల్లా మాలిక్, అమీన్ స్వామి మొదలైన 16 మంది పూర్వపు పీఠాధిపతుల మజార్ల వద్దకు చేరుకుని గంధం, చాదర్, పూలు సమర్పించారు. అనంతరం ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి అమీన్ పీర్ దర్గా గ్రంథాలయం చేరుకున్న ముఖ్యమంత్రికి పీఠాధిపతుల వారు దర్గా విశిష్టత, చారిత్రక వైభవాన్ని వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్గా ఖ్యాతీ, మహిమలు, ప్రపంచ వ్యాప్తంగా పరిమళిస్తున్నాయంటే.. కులమత తేడాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా భాగస్వామ్యం కావడమే ప్రధాన కారణమన్నారు. తాను పుట్టిన సొంత జిల్లాలో ఇలాంటి మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అంతకు మించి అమీన్ పీర్ దర్గాను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదరిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులని చెప్పారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో.. అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందివ్వగలుగుతున్నామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేస్తూ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా మైనారిటీ ప్రజల సేవలో తరిస్తున్న అంజాద్ బాషాకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కడప నగర పాలక కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.